స్టీఫెన్ సన్ కు కోర్టు ఝలక్...కోర్టు ధిక్కారణ చర్యలు

తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు కోర్టు ఝలక్ ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్య తనకు ఈ కేసుతో సంబంధం లేదని.. తన అరెస్ట్ పైన స్టే విధించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో సవాల్ చేస్తూ న్యాయమూర్తిని మార్చాలన్న స్టీఫెన్ సన్ పిటిషన్ ను కోర్టు కొట్టి పారేసింది. ఈ సందర్భంగా స్టీఫెన్ సన్ వైఖరిపై కోర్టు మండిపడింది. స్టీఫెన్సన్ కోర్టును తప్పుదోవ పట్టించారని.. కేసు విచారణ అదే బెంచ్‌లో కొనసాగుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. స్టీఫెన్ సన్ పైన కోర్టు ధిక్కారు చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.