విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు

శీతాకాలంలో అరకుకు పర్యాటకులు పోటెత్తుతారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు అరకులోయకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి అరకుకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైలు ఈ నెల 28 నుంచి జనవరి 19 వరకూ ప్రతి శని ఆదివారాలలో నడుస్తుందని వాల్తేర్ సీనియర్ డీసీఎం తెలిపారు.

ఈ స్పెషల్ ట్రైన్ ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు అరకు నుంచి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ రైలులో ఒక సెకండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ బోగీలతో పాటు 10 స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ బోగీలతో పాటు ఒక జనరల్ కమ్ లగేజ్ బోగీ ఉంటుంది.  ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్‌.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగిస్తుంది. పర్యాటకులకు ఉపయుక్తంగా ఉండే విధంగా విశాఖ నుంచి అరకుకు ప్రత్యేక రైలు నడపడానికి రైల్వేశాఖ నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu