స్మృతీ శాఖ మార్పుకు కారణాలు అవేనా.. !

 


ప్రధాని నరేంద్రమోడీ కేబినేట్ ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వివిధ మంత్రుల శాఖలు మార్పుచెందాయి. ఈ మార్పుల వెనుక కూడా పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్మృతీ ఇరానీ శాఖ మార్పుపై.. గతంలో ఒక్కమాట కూడా మాట్లాడకుండా స్మృతీకి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖను అప్పగించిన మోడీ.. ఈసారి మాత్రం ఆమెకు జౌళి శాఖను అప్పగించారు. అయితే ఈశాఖను అప్పగించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం మేరకే ఆమెకు మోడీ ఈ శాఖను కట్టబెట్టారని అంటున్నారు. అంతేకాదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల గొడవ, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వివాదాలు కూడా ఆమె శాఖ మార్పుకు ముఖ్యపాత్ర పోషించాయని అంటున్నారు. దీంతో రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన హెచ్ఆర్డీకు ఎలాంటి వివాదాలు లేని ప్రకాశ్ జవదేవకర్ కు అప్పగించారని అంటున్నారు.