విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం..

 

సింగపూర్ లోని ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. చాగీ విమానాశ్రయంలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ హఠాత్తుగా విమానంలో పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ రన్‌వే పై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. రన్‌వే పై దిగిన వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. అధికారులు హుటాహుటిన ప్రయాణికులను, సిబ్బందిని విమానం నుంచి బయటకు తీసుకురావడంతో సురక్షితంగా ప్రయాణికులు బయటపడ్డారు. కాగా విమానంలో 222 మంది ప్రయానికులు, 19మంది సిబ్బంది ఉన్నారు.