ఎన్కౌంటర్ కి దగ్గరలో శ్రుతిహాసన్

 

మొన్నామధ్య ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ఏపీ మంత్రి అవాక్కయ్యేలా చేసిన శ్రుతిహాసన్ ఇప్పుడు తను అవాక్కయ్యింది. ఏలాగంటారా.. శేషాచల అడవిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే 20 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో హీరోయిన్ శ్రుతిహాసన్, హీరో విజయ్ వారు నటిస్తున్న పులి చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. సాయంత్రం షూటింగ్ పూర్తి చేసుకొని వారు తిరుపతి వెళ్తుండగా తలకొన చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్కౌంటర్ జరిగిన విషయం పోలీసులు చిత్ర యూనిట్కు తెలిపారు. కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ అనేసరికి శృతి హాసన్ అవాక్కయినట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu