షిర్డీ సాయి హుండీలో అమూల్యమైన కానుక

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబాకు అజ్ఞాత భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. గుర్తుతెలియని భక్తుడు ఓ ప్యాకెట్‌లో ఖరీదైన కానుకను చుట్టి హుండీలో వేశాడు. హుండీ లెక్కింపు సందర్భంగా ప్యాకెట్‌ను విప్పి చూడగా అది మామూలు ఆభరణంగానే భావించారు. అయితే అది డైమండ్ నెక్లెస్ అని తేలడంతో షిర్డీ సంస్థాన్ అధికారులు దాని విలువను లెక్కగట్టేందుకు ముంబైలోని ప్రముఖ నగల వ్యాపారులను సంప్రదించారు. దీనిని పరిశీలించిన బంగారు వ్యాపారులు దీని బరువు 9 క్యారెట్లుగా..విలువ సుమారు 85 లక్షలు ఉండవచ్చని నిర్థారించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu