హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ళ
posted on Sep 29, 2014 6:08PM

మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) సత్య నాదెళ్ల సోమవారం హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్కు(ఎంఐడీసీ) వచ్చారు. మైక్రోసాఫ్ట్ అధికార బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే ఆదివారం నాడు ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. సోమవారం ఎంఐడీసీ అంతర్గత సమావేశంలో ఉద్యోగులను ఉద్దేశించి చేసిన కీలకోపన్యాసంలో భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. కంపెనీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై తన అభిప్రాయాలను మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో సత్య నాదెళ్ళ పంచుకున్నారు. మైక్రోసాఫ్ట్కు సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ళ హైదరాబాద్కి రావడం ఇదే తొలిసారి. అలాగే మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్కి రావడం కూడా ఇదే మొదటిసారి.