సానియాకు ఖేల్ రత్నఅవార్డు

 

క్రీడా రంగంలో విశేష కృషి చేసిన వారికి ప్రతీఏటా ఇచ్చే ఖేల్ రత్న, అర్జున అవార్డుల పేర్లను కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించింది. దేశంలో మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా భావించబడే రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఖరారు చేసింది. ప్రముఖ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మకు అర్జున అవార్డు ఖరారయింది. అర్జునా అవార్డులు అందుకోబోతున్న వారిలో ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్, స్కేటింగ్ క్రీడాకారుడు అనూవ్ కుమార్ అర్జునా అవార్డులకు ఎంపిక అయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu