ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా.. సండ్ర

నోటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు తెదేపా నేతలు వేం నరేందర్ రెడ్డికి, సండ్ర వెంకట వీరయ్యలకు కూడా విచారణలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే అప్పుడు వేం నరేంద్ర రెడ్డి మాత్రమే ఏసీబీ విచారణలో పాల్గొన్నారు. సండ్ర తనకు గుండె సంబంధిత సమస్య ఉందని పదిరోజుల తరువాత విచారణలో పాల్గొంటానని ఏసీబీకి లేఖ రాశారు. కానీ ఆ పదిరోజుల గడువు ఎప్పుడో ముగిసింది. ఈ నేపథ్యంలో సండ్ర ఎక్కడ ఉన్నాడని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు సండ్ర ఏసీబీకి మరో లేఖ రాశారు. తాను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యానని.. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్దంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu