సమ్మక్క సారలమ్మ మినీ జాతర షురూ

 తెలంగాణలోని ములుగు జిల్లాలో  ప్రతీ  రెండేళ్లకోసారి వచ్చే సమ్మక్క సారలమ్మ మినీ జాతర బుధవారం ప్రారంభమైంది. మండమెలిగె పండుగతో ఈ జాతర ప్రారంభమైంది. ఈ మినీ జాతరకు తెలంగాణా ప్రభుత్వం 5 కోట్ల 30 లక్షలు ఖర్చుచేయనుంది.  రేపు మండమెలిగే పూజలు, ఎల్లుండి భక్తులకు మొక్కులు చెల్లింపు, చివరి రోజైన శనివారం మినీ  జాతర ముగుస్తుంది. ఈ మినీ జాతరకు తెలుగురాష్ట్రాలతో బాటు చత్తీస్ ఘడ్ ,  మహారాష్ట్ర , ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోసం ఆర్టీసీ  200 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మినీ జాతర ముగిసిన మరుసటి రోజు వనదేవతల దర్శనం ఆదివారం ఉండటంతో ఈ సారి భక్తులు ఎక్కుద సంఖ్యలో వస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu