సల్మాన్ కు ఊరట.. బెయిల్ మంజూరు..

 

కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ కు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు పదివేల జరిమానా కూడా విధించారు. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ని జోథ్ పూర్ సెషన్స్ కోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, బెయిల్ ఆర్డర్ కాగితాలు జైలు అధికారులకు అందిన అనంతరం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది. ఈరోజు రాత్రి ఏడున్నర గంటల సమయంలో సల్మాన్ ని విడుదల చేయవచ్చని సీనియర్ న్యాయవాది భరత్ భూషణ్ శర్మ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu