అమిత్ షా పై మాయవతి ఫైర్... అందుకే అలా మాట్లాడుతున్నారు..!

 

మోడీ కి భయపడి పిల్లలు, పాములు, కుక్కలు, మింగిసలు అన్ని ఒక్కటయ్యాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ అధినేత్రి మాయావతి అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించి టీడీపీ సహా మిత్రపక్షాలు అన్నీ దూరమతున్న తరుణంలో బీజేపీ ఒంటరిగా మారుతోందని... అందుకే అమిత్ షా ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పారని... దీంతో, ఆ పార్టీ నేతలు దిక్కు తోచని స్థితిలోకి పడిపోయారని... ఉప ఎన్నికలకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతిపక్షాలపై ఇలాగే నోరు పారేసుకుని, భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారని చెప్పారు. మోదీ, అతని శిష్యుడు అమిత్ షా నాయకత్వంలో బీజేపీ విలువలు నీచమైన స్థాయికి దిగజారాయని విమర్శించారు. ఈ మేరకు ఆమె అమిత్ షాకు ఓ లేఖ రాశారు. అసహ్యమైన మాటలు, ఇతరులను చులకన చేసే వ్యాఖ్యలతో దేశాన్ని నిర్మిస్తారా? ఇదేనా మీరు చెప్పే నవ భారతం? అంటూ లేఖలో అమిత్ షాను మాయావతి కడిగిపారేశారు. దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి ఇలాంటివి గౌరవాన్ని ఇస్తాయా? అని ప్రశ్నించారు.