సార్క్ సమావేశాలు రద్దు..

 

నవంబర్ లో పాకిస్థాన్ లో జరగనున్న సార్క్ సమావేశాలు రద్దయ్యాయి. సార్క్ సమావేశాలకు హాజరు కావట్లేదని భారత్ ప్రకటించిన నేపథ్యంలో భార‌త్‌తోపాటు బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌లు కూడా హాజరుకాబోమని తేల్చిచెప్పేసింది. ఈసారి సమావేశాల బాధ్యత నేపాల్ పైనా ఉన్నందున నాలుగు దేశాలు పాల్గొనని నేపథ్యంలో సమావేశాలు నిర్వహించే ప్రసక్తి లేదని.. సమావేశాలు రద్దు చేస్తున్నట్టు నేపాల్లోని దౌత్య వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. స‌మావేశాల‌ ర‌ద్దు ప్ర‌క‌ట‌న‌కు కావాల్సిన లాంఛ‌నాల‌ను పూర్తి చేసి అధికారిక ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని ఖాట్మండులోని దౌత్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే దీనిపై నేపాల్ మాత్రం ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu