జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు అరెస్ట్... ఓవర్ టేక్ చేసినందుకే చంపేశా


బీహార్లోని గయలో తన కారును ఓవర్ టేక్ చేశాడని చెప్పి బీహార్ అధికార పార్టీ జేడీయూ ఎమ్మెల్సీ కొడుకు రాఖీ యాదవ్ ఓ ఇంటర్ విద్యార్ధిపై దాడి చేసి తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై రాఖీ యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గరనుండి పారిన్ మేడ్ పిస్టల్ ను స్వాదీనం చేసుకున్నారు. దాడి జరిగిన తర్వాత తప్పించుకుని చివరకు పోలీసులకు చిక్కగానే రాఖీ యాదవ్ తన తప్పును ఒప్పేసుకున్నాడు. తన కారును ఓవర్ టేక్ చేసిన కారణంగానే తాను ఆ విద్యార్ధిని కాల్చేశానని అతడు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. రాఖీ యాదవ్ తనకు తానుగా లొంగిపోలేదని గయ ఎస్పీ గరిమా మాలిక్ చెప్పారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు వెల్లడిస్తామని ఆమె తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu