రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురి మృతి

 

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల దగ్గర జాతీయ రహదారి మీద శనివారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. విజయవాడ నుంచి విశాఖకు వెళ్తున్న ఇన్నోవా వాహనం ఆగి వున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మరణించారు. ఇదిలా వుండగా జార్ఖండ్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. మరణించిన వారు శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందినవారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu