ఇంట్లోకి దూసుకెళ్లిన స్కార్పియో.. ఏడుగురు మృతి

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం పెద్దబోధనం గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా జాతీయ రహదారిపై తిరుపతికి వెళుతున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్నా ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. మరణించిన వారందరూ మహారాష్ట్ర పుణె జిల్లా బారామతికి చెందిన వారుగా పోలీసుల తెలిపారు.