వాళ్లను తిడితే వీళ్ల కడుపు నిండుతుందా.. రేవంత్ రెడ్డి

 

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఏడాది పాలనలో ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గ్రామాన్ని చూస్తే తెలంగాణ పాలన ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుందని ఎద్దేవ చేశారు. లేచిన దగ్గర నుండి ఆంధ్రా వాళ్లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని.. వాళ్లని తిట్టడంవల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఏం లేదని.. వాళ్లని విమర్శించినంత మాత్రాన తెలంగాణ ప్రజల కడుపు నిండదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వందలాది కార్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుడి షోరూమ్‌లో కొన్నవేనని చెప్పారు. యాదగిరి గుట్ట డిజైన్ ఇచ్చింది కూడా ఆంధ్రాకు చెందిన వ్యక్తే అని తెలిపారు. ప్రతి పనిని ఆంధ్రా వారితోనే కలసి చేస్తున్న కేసీఆర్... హైకోర్టు విభజనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డొస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించారు. తన మీద కక్ష్యతో తన నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. అది సరికాదని.. అలా చేస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu