కేసీఆర్ మనమడు తినే బియ్యం పంపండి.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ యువనేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం  పెడుతుందని చెపుతున్నారు కాని వాటికి బదులు దారుణమైన బియ్యంతో భోజనం పెడుతున్నారని విమర్శించారు. ఈ సన్నబియ్యం వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరగుతుందని.. ఏదో బియ్యం తీసుకొచ్చి వాటికి పాలిష్ చేసి సన్న బియ్యమని మభ్యపెడుతున్నారని అన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే దీనిపై చర్య తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఆ అన్నంను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులు ఎవరైనా తింటారా.. కేసీఆర్ మనమడు ఏ రకమైన సన్న బియ్యం తింటారో అలాంటి బియ్యాన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా అందించాలని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu