సోనియా అల్లుడికి ఊరట

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హైకోర్టులో ఊరట లభించింది. భూముల కొనుగోళ్ళ వ్యవహారంపై వాద్రాపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. వాద్రాపై విచారణకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు హర్యానాలోని గుర్గావ్‌లో జరిపిన భూముల లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు జరింపిచాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ జి రోహిణి, జస్టిస్ ఆర్ ఎస్ ఎండ్లాలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ విచారణకు నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu