టీటీడీలో త‌ర‌చూ వివాదాల‌కు కార‌ణం?

భార‌త‌మ్మ సైన్య‌మేనా?
వీరెంత మంది వ‌ర‌కూ ఉన్నారు?
టీటీడీలో రంగ ప్ర‌వేశం ఎప్పుడు జ‌రిగి ఉండొచ్చు? 

తిరుమ‌ల‌లో త‌ర‌చూ   వివాదాలు జ‌ర‌గ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటి?  ఈ సంస్థ‌లో అన్నమ‌య్య మ‌త‌స్తులు కాకుండా అన్య‌మ‌త‌స్తులుండ‌ట‌మే అస‌లు కార‌ణ‌మా? ఇంత‌కీ వీరి వాద‌నేంటి?  త‌ర‌చూ మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారం..  ఆ త‌ర్వాత ఇదిగో టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేసేవ‌ర‌కూ ఎలా కొన‌సాగుతూ వ‌స్తోంది? తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో ఇటీవ‌లి కాలంలో వ‌రుస వివాదాలు న‌డుస్తున్నాయ్. ఆల‌య ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా ఇవి ఉంటున్నాయ్. వీటి వెన‌క  రెండు వేల వ‌ర‌కూ ఉన్న‌ భార‌త‌మ్మ సైన్యం దాగి ఉందా? అన్న‌దొక డౌట్ ఫుల్ డిబేట్.  ఇంత‌కీ వీరెలా ఈ వ్య‌వ‌స్థ‌లో వేళ్లూనుకున్నారు? దీనంత‌టికీ కార‌ణం భూమ‌న వంటి  క్రిష్టియ‌న్లు చైర్మ‌న్ కావ‌డ‌మేనా? అన్న‌దొక అనుమానం కాగా..  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడంటే కేవ‌లం భూమ‌న‌కే కాదు.. వైయ‌స్ కి కూడా ఏమంత గౌర‌వం లేదని అంటారు.  ఏడు కొండ‌లు ఎందుకు?  రెండు కొండ‌లు చాలు క‌దా అన్న సీఎం వైయస్. అలాంటి వైయ‌స్ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు అనుకుంటే..  ఆయ‌న  కొడుకు జ‌గ‌న్ వ‌చ్చీ రావ‌డ‌మే గొడ‌వ గొడ‌వ‌.

హైంద‌వాల‌యాల్లో అన్య‌మ‌త‌స్తులు ఉండ‌కూడ‌ద‌ని ఆనాటి  సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం జీవో తేవాల‌ని భావిస్తే కొంద‌రు క్రిష్టియ‌న్ సంఘాల వారు అడ్డుకున్నారు. ఇరువురిలో ఎవ‌రికి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని చూసిన జ‌గ‌న్   క్రిష్టియ‌న్ల వైపు మొగ్గారని అంటారు. దీంతో ఎల్వీని జీఏడీకి రిపోర్ట్ చేయ‌మ‌న్నారట‌. ఈ ఆగ్ర‌హంతో ఆయ‌న ఆనాటి ప్ర‌భుత్వం నుంచి ఎల్వీ వైదొలిగారని చెబుతారు. ఆ స‌మ‌యంలో కొన్ని క్రిష్టియ‌న్ సంఘాలు కేకులు క‌ట్ చేసిన  ఫోటోలు సైతం అప్పట్లో వెలుగులోకి వ‌చ్చాయని చెబుతారు. అంతేనా కావాల‌ని తిరుమ‌ల అట‌వీ సిబ్బందికి జీతాలు పెంచ‌క వారి ద్వారా వ‌న్య‌ప్రాణుల‌ను భ‌క్తులు న‌డిచే దారుల్లోకి ర‌ప్పించి.. ఏకంగా చిన్న పిల్ల‌ల ప్రాణాలు తీసే వ‌ర‌కూ తేవ‌డం కూడా అప్ప‌ట్లో పెను దుమారం న‌డిచింది. దీని వెన‌క కూడా ఏదైనా కుట్ర దాగి ఉందా? అన్న అనుమానాలున్నాయి. 

ఇక అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న రోజ‌మ్మ అయితే ఏకంగా క్రీస్తు డాల‌ర్ క‌లిగిన కెమెరామెన్ తో స‌హా వ‌చ్చి చేసిన హ‌డావిడి హంగామా మాములుగా లేదని అంటారు.  అంతేనా కిరాక్ ఆర్పీ చెప్పేదాన్నిబ‌ట్టి చూస్తే 30 వేల‌కు పైగా ఆమె సిఫార్సు లెట‌ర్లు ఇచ్చార‌ని తెలుస్తోంది. దీని వెన‌క కూడా అతి పెద్ద స్కామ్ న‌డిచేద‌ని టాక్. ఇలాక్కూడా రొజ‌మ్మ వెన‌కేసిన‌ట్టుగానూ చెబుతారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని క్రిష్టియ‌న్ లాబీ ద్వారా భారీ ఎత్తున హిందూ దేవాల‌యాల్లోకి క్రిష్టియ‌న్లు ప్ర‌వేశించి.. అప్ప‌ట్లో ఆల‌య ప్ర‌తిష్ట మంట‌గ‌ల‌పాల‌ని చూసేవార‌ని అంటారు. ఆనాటి పాపాల కార‌ణంగానే జ‌గ‌న్ అధికారం కోల్పోయినట్టు అంచ‌నా క‌డ‌తారు..  అయినా స‌రే జ‌గ‌న్ అండ్ కోకి ఇంకా బుద్ధి రావ‌డం లేద‌ని అంటున్నారు. అప్ప‌ట్లో తాము ప్ర‌వేశ పెట్టిన ఈ బీ- సైన్యాన్ని అడ్డు పెట్టుకునే.. ఇప్పుడు వి త‌ర‌చూ వాదాల‌ు రాజుకునేలా చేస్తున్నారట‌. ఈ విష‌యం ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందోన‌ని.. భార‌త‌మ్మ అదే ప‌నిగా త‌మ ఇంట్లోనే తిరుమ‌ల సెట్ వేయించార‌నీ చెబుతారు.   లేకుంటే ఎవ‌రో ఒక భ‌క్తుడు డౌన్ డౌన్ అంటూ అరిచాడే అనుకుందాం. అత‌డి ఆలోచ‌న ఏంటంటే త‌న‌కు త్వ‌ర‌గా దైవ ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌నే భావిద్దాం... బేసిగ్గా వెంక‌న్న‌లాంటి దేవ‌దేవుడి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు.. అంతా ఆయ‌న మీదే భార‌మేసి.. ఆయ‌న ఎప్పుడు క‌నిపిస్తే అప్పుడు త‌న మొక్కులు చెల్లించుకుని రావ‌ల్సి ఉంటుంది. 

గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో ఉన్న‌పుడు అనాల్సింది టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అని కాదు. గోవిందా గోవిందా అని. అప్పుడే పాప ప్ర‌క్షాళ‌న జ‌రిగేది. కంపార్ట్ మెంట్ల‌లో ఉన్న‌పుడు మ‌న‌కున్న స‌మ‌స్త రేడియేష‌న్ రోగాలు పోతాయ్. కార‌ణం మొబైల్ ఫోన్లు ఎప్పుడైతే బ‌య‌ట ప‌డేస్తామో,  అప్పుడు వాటి తాలూకూ ప్ర‌కంప‌న‌లు, ప్ర‌భావాల నుంచి దూర‌మ‌వుతాం. అది మ‌న శారీర‌క మాన‌సిక స్థితిగతుల‌కు ఎంతో మేలు చేస్తుంది. కాకినాడ‌కు చెందిన అచ్చారావ్ అనే ఆ భ‌క్తుడు  చేసిందే ఒక త‌ప్ప‌యితే.. దాన్ని వీడియో తీసిన వాడికి ఎంత భ‌యం లేక పోవాలి? 

స‌రే ఇప్పుడున్న జ‌మానాలో సెల్ ఫోన్లు కామ‌నే కాద‌న‌డం లేదు. కానీ వెంక‌న్న లాంటి  మ‌హిమాన్విత దేవుడి విష‌యంలో న‌మ్మ‌కం వారిని ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌కుండా ఆపేస్తుంది. అలా కూడా ఒకరు న‌మ్మ‌కాన్ని అతిక్ర‌మించి బ‌య‌ట‌కొచ్చేలా చేశారంటే దాన‌ర్ధ‌మేంటంటే వెంక‌న్న అంటే భ‌యం లేద‌ని. భక్తి లేదని. ఇలాంటి వారు అయితే పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ కి చెందిన వారు, లేదంటే అన్య‌మ‌త‌స్తులే అయి ఉంటార‌ని అంచనా వేస్తున్నారు శ్రీవారి భ‌క్తులు.