రావెల సుశీల్ కేసులో మహిళ ట్విస్ట్..సుశీల్ ఎవరో కూడా తెలియదు..

 

మంత్రి రావెల్ కిషోర్ బాబు తనయుడు రావెల సుశీల్.. ఓ ముస్లిం మహిళను చెయ్యి పట్టుకొని కారలోకి లాగబోయాడంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్ ను పోలీసు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు పోలీసులు సుశీల్ పై పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. తనపై తప్పుడు అభియోగాలు మోపారని సుశీల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీనిపై హైకోర్టు విచారించగా.. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళ, కోర్టుకు వచ్చి రావెల కిశోర్ ఎవరో తనకు తెలియదని వాంగ్మూలం ఇవ్వడంతో, సరైన సాక్ష్యాలు లేని కారణంగా సుశీల్ పై ఆరోపణలను తొలగిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu