మళ్లీ పార్టీలోకి రాంగోపాల్‌ యాదవ్‌...

 

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కుటుంబంలో రాజకీయ విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీ అయిన రాంగోపాల్‌ యాదవ్‌ పై వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రాంగోపాల్‌ యాదవ్‌ పై వేటు పడినా కానీ ఆయన నిన్న రాజ్యసభకు హాజరయ్యారు. అంతేకాదు నోట్ల రద్దుపై కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ మళ్లీ ఆహ్వానించింది. ఎస్పీలో ఆయన గతంలో చేసిన బాధ్యతలను మళ్లీ అప్పగిస్తున్నట్లు ప్రకటిస్తూ పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ లేఖను విడుదల చేశారు.  రాంగోపాల్‌ యాదవ్‌పై వేసిన వేటును ఎత్తివేస్తున్నామని, ఆయన పార్టీలో పూర్వపు బాధ్యతలే నిర్వర్తిస్తారని ప్రకటించారు.