పుష్కరాలకు రాంచరణ్ విమానాలు
posted on Jul 8, 2015 4:55PM

గోదావరి పుష్కరాలు మొదలవుతున్నాయి.. పదిరోజుల పాటు జరిగే ఈ పుష్కరాలలో పాల్గొనడానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అయితే పుష్కరాలేమో కానీ ప్రయాణికులకు మాత్రం ట్రావెలింగ్ లో కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మీరు కూడా పుష్కరాలకు వెళ్లడానికి ప్లానింగ్ లో ఉన్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతోనే విమానంలో పుష్కరాలకు వెళ్లే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇంతకీ అంత ఆఫర్ చేసింది ఎవరు అనుకుంటున్నారా.. ట్రూ జెట్ విమాన సంస్ధ. హీరో రాంచరణ్ అంబాసిడర్ గా ఉన్న ట్రూ జెట్ విమాన సంస్ధ గోదావరి పుష్కరాలకు తమ సర్వీసులను అందించనున్నాయి. పుష్కరాల సందర్భంగా అక్కడ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ దృష్ట్యా అతి తక్కువ ఖర్చుకే విమాన సర్వీసులు ఇస్తున్నామని ట్రూ జెట్ విమాన సంస్ధ ఎండీ ఉమేష్ తెలిపారు. ఈ సర్వీసులు ఈ నెల 12వ తేదీ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నుండి రాజమండ్రి వరకు మొదలవుతాయని అన్నారు. అంతేకాక జులై 26వ తేదీ నుండి ఔరంగాబాద్, హుబ్లీ, తిరుపతి నుండి కూడా సర్వీసుల కల్పిస్తామని ఉమేష్ అన్నారు. తక్కువ ధర.. ఎక్కువ మంది ప్రయాణికులతో బిజినెస్ లో ఎదుగుదల సాధించవచ్చని నమ్ముతున్నానని.. వచ్చే మార్చి లోపు మరో పది నగరాలలో విస్తరించాలని.. మెట్రో నగరాలలో ఇప్పటికే విమానాలు రద్దీ బాగానే ఉన్నా ప్రాంతీయ ప్రాంతాల్లో ఇంకా వాటిని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆదిశగా మేము మా సర్వీసులను విస్తరింపచేయడానికి చూస్తున్నామని ఉమేష్ స్పష్టం చేశారు.