92 పైసలకు రూ. 10 లక్షల ప్రమాద బీమా..
posted on Sep 2, 2016 2:38PM

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 92 పైసలకు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకానికి ఆమోదం తెలిపిన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రమాద బీమా అమల్లోకి వచ్చింది. ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ నుంచి కౌంటర్లలో ఇస్తున్న టికెట్ల వరకూ ఖరీదుపై 92 పైసల ప్రీమియాన్ని వసూలు చేస్తున్నారు. ఈ ప్రమాద బీమా పథకం ద్వారా.. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షలు, అంగవికలురైతే రూ. 7.5 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్సకు రూ. 2 లక్షలు బీమా అందుతుంది. అంతేకాదు మృతదేహాలను ప్రమాదస్థలి నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు రూ. 10 వేలు సైతం అందుతుంది అదనంగా అందుతుంది. కాగా సబర్బన్ రైళ్లు మినహా మిగతా అన్ని రైళ్లలో ప్రయాణాలు జరిపే వారికి బీమా వర్తిస్తుంది.