92 పైసలకు రూ. 10 లక్షల ప్రమాద బీమా..

 

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 92 పైసలకు రూ. 10 లక్షల ప్రమాద బీమా పథకానికి ఆమోదం తెలిపిన సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రమాద బీమా అమల్లోకి వచ్చింది. ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ నుంచి కౌంటర్లలో ఇస్తున్న టికెట్ల వరకూ ఖరీదుపై 92 పైసల ప్రీమియాన్ని వసూలు చేస్తున్నారు. ఈ ప్రమాద బీమా పథకం ద్వారా.. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షలు, అంగవికలురైతే రూ. 7.5 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్సకు రూ. 2 లక్షలు బీమా అందుతుంది. అంతేకాదు మృతదేహాలను ప్రమాదస్థలి నుంచి స్వగ్రామాలకు తరలించేందుకు రూ. 10 వేలు సైతం అందుతుంది అదనంగా అందుతుంది. కాగా సబర్బన్ రైళ్లు మినహా మిగతా అన్ని రైళ్లలో ప్రయాణాలు జరిపే వారికి బీమా వర్తిస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu