లోకేష్ స్నేహితుడు అభీష్టపై మళ్లీ ఆరోపణలు

 

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్నేహితుడు అభీష్టపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు, నిబంధనలకు విరుద్ధంగా అభీష్టను సీఎం చంద్రబాబు పేషీలో ఓఎస్డీగా నియమించారని ఆరోపించిన రఘువీరా.... లోకేష్ స్నేహితులు, రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు, అభీష్టతోపాటు మరికొందరు లోకేష్ సన్నిహితులు... బినామీ కంపెనీల పేరుతో ప్రభుత్వ ధనాన్ని తమ ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అమరావతి శంకుస్థాపన ఏర్పాట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ కూడా అభీష్ట కనుసన్నల్లో నడుస్తున్నదేనని ఆయన ఆరోపించారు, సీఎం ఓఎస్డీగా అభీష్టను అధికారికంగానే నియమించామని ఒకసారి, అధికారికంగా నియమించలేదని మరోసారి చెబుతున్నారని, దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు, రూల్స్ కి విరుద్ధంగా అభీష్టను ఓఎస్డీగా నియమించి... అతనికి కీలకమైన శాఖలు అప్పగించారని ఏపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు.