రాఘురాం రాజన్ పై మరోసారి సుబ్రహ్మణ్యస్వామి ఫైర్.. రాజ‌నే కావాలంటున్న నెటిజన్లు


గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు రఘురాం రాజన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు మరోసారి ఆయనపై మండిపడ్డారు. రఘురాం రాజన్ గ్రీన్ కార్డు పై ఇక్కడ ఉన్నారు.. ఆయన పరిపూర్ణమైన భారతీయుడు కాదు అని విమర్శించారు. అంతేకాదు దీనిపై ఆయన ప్రధాని మోడీకి కూడా లేఖ రాసినట్టు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం ఎంతో మంది భారతీయ జాతీయ భావాలున్న ప్రతిభావంతులు ఉండగా యూపీఏ ప్రభుత్వం గతంలో నియమించిన వ్యక్తే ఇంకా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఎందుకు కొనసాగాలి? రఘురామ్ రాజన్‌ను వెంటనే తొలిగించాలని అని లేఖలో పేర్కొన్నారు.

 

అయితే రాజన్ పై సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేస్తున్నా.. నెటిజన్ల నుండి మాత్రం ఆయనకు సపోర్ట్ లభిస్తోంది. ఆర్బీఐ గ‌వర్న‌ర్‌గా రాజ‌నే ఫ‌ర్ఫెక్ట్ అని, రెండోసారీ ఆయ‌నే ఈ బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని ఓ సర్వేలో తెలిసింది. అంతేకాదు ర‌ఘురాం రాజ‌న్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యస్వామి చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌న్లు ఖండించారు. రాజ‌న్‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు.