కర్నూల్ లో భారీ పేలుడు.. 11 మంది మృతి

 

కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని ఒక క్వారీలో భారీ పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.. క్వారీలో బ్లాస్టింగ్ లకి ఉపయోగించే పేలుడుపదార్ధం పేలి ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.. మరోవైపు ఈ ఘటనలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది.. ఈపేలుడు మూలంగా గ్రామంలోని పదిళ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి.. అలానే షెడ్లు కూడా కూలిపోయాయి.. ఆ షెడ్ల క్రింద మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. ఈఘటనపై సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.