పీవీ జయంతి.. తెలంగాణ రాష్ట్ర పండుగ

 

మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని పురస్కరించుకుని ఈనెల 28వ తేదీన పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. పీవీ జయంతి ఏర్పాట్లపై తెలంగాణ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి సమీక్ష నిర్వహించారు. పీవీ జయంతి రోజున పీవీ నరసింహారావు అంత్యక్రియలు జరిపిన పి.వి. జ్ఞానభూమి దగ్గర జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటారని తెలిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు పంపనుంది.