చంద్రబాబును కల్సిన  పిటీ ఉష  

ఎపి  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష భేటీ అయ్యారు. 2029లో ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని  చంద్రబాబు ఆమె మద్దత్తు కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణపై వీరువురు చర్చించారు. అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ ఏర్పాటు,  స్పోర్ట్స్ సిటీ అభివృద్దిపై చర్చించారు.  రాష్ట్రానికి స్పోర్ట్స్ అథారటీ  ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు చంద్రబాబు ఆమె మద్దత్తు కోరారు.