జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
posted on Jul 4, 2025 7:40PM
.webp)
జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జర్నలిస్ట్లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధ సారధి, నారాయణలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై విధివిధానలను రూపోందించనుంది. వాటిని సమర్పంచనుంది. ఆ తర్వాత ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రెవెన్యూ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వారసత్వ భూములకు సచివాలయంలోనే సక్సెషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షల లోపు విలువైన భూములకు రూ.100 రుసుముతో సర్టిఫికెట్లు పొందవచ్చు. క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఆగస్టు 2లోగా, రెవెన్యూ సమస్యలు అక్టోబర్ 2 నాటికి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.