ముగ్గురిని చంపాం.. ఇప్పుడు నువ్వే.. ప్రొఫెసర్ కు బెదిరింపు లేఖ

 

ప్రొఫెసర్ కే.ఎస్ భగవాన్ కు తీవ్రమైన స్థాయిలో బెదిరింపు లేఖ వచ్చింది. మైసూర్ దారుడవాడలోని కల్యాణ నగర్ లో ఉంటున్న కే.ఎస్. భగవాన్ ఇంటికి ఒక ఉత్తరం రాగా అందులో తనను బెదిరిస్తూ రాశారు. అందులో ఏముందంటే నిన్ను ఎవ్వరూ ఏం చేయలేరని అనుకోవద్దు.. ఇప్పటికే మా చేతిలో ముగ్గురు హతమయ్యారు.. నిన్నుఅంతం చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము.. రోజులు  లెక్కపెట్టుకో పోలీసులు కూడా నిన్ను కాపాడలేరని రాసి ఉంది. వెంటనే భగవాన్ బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అయితే అనేక విషయాలలో భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. అందులోనూ భగవద్దీతను చులకన చేస్తూ  "భగవద్దీతను అగ్నికి ఆహుతి చెయ్యాలి అని.. నిండు గర్బిణిని అడవులకు పంపించిన శ్రీరాముడిని మీరు ఆదర్శంగా తీసుకుంటారా, 16,000 మందిని పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు పాపాత్ముడు" అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేయడంవల్లే దీంతో ఒక వర్గం వారు తనను బెదిరిస్తూ ఇలాంటి లేఖలు రాసిఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భగవాన్ ఇంటి దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.