అత్తిలి సత్తి… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. 

నిజామాబాద్ జిల్లాలో ‘అత్తిలి సత్తి’… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. నిట్టనిలువునా దోచేశాడు. అందుగలదు ఇందులేదు అన్న సందేహం లేదు ఎందెందు చూసిన అందందు గలదు మోసం. ప్రతి పనిలో.. ప్రతిదానిలో భాగమైపోయింది. అందరూ  లాజిక్కుల కంటే ఎక్కువగా మేజిక్కులనే నమ్ముతారు. అందుకే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పినట్లు మనదేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఫేమస్. మన దేశంలో నకిలీ స్వామీజీలు, దొంగ బాబాల చేసిన.. చేస్తున్న స్కాములు అంత ఇంత కాదు వాళ్ళ మీద సీరియల్స్ తెస్తే ఎపిసోడ్స్ సరిపోవు.. బుక్స్ రాస్తే పెన్నులు పేపర్లు సరిపోవు.. స్వామిలు బాబాలు మోసాలు చేసిన ఎన్ని దారుణాలు చేసిన మళ్ళీ మళ్ళీ జనం  తెలివి లేకుండా ఇంకా వారి వలలో  పడుతున్నారు. తాజాగా సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా  పూజారి. నిజామాబాద్ జిల్లా, డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) లో ఓ పూజారి బారి మోసానికి తెరలేపాడు. అతని పేరు శ్రీనివాస శర్మ, పురోహితం చేస్తే వచ్చిన  డబ్బులు సపోవడంలేదు అనుకున్నాడేమో మరి.  సుమంగళి వ్రతాలూ చేస్తానని చెప్పి పలువురు మహిళల దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  కోటిన్నర వసూలు చేసి ఉడాయించాడు. డిచ్ పల్లి , బోధన్ , మాక్లూర్ లో మహిళల భర్తల క్షేమం కోసం వ్రతాలూ చేస్తానని నమ్మించి వసూళ్లకు పాల్పడ్డాడు నిందితుడు. కొందరు మహిళలు భర్తలకు తెలియకుండా లక్షల్లో అతడికి చెల్లించారు. శ్రీనివాస్ శర్మ మోసం చేశాడని ఆలస్యంగా గ్రహించిన బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పాలసీల పేరుతో భారీ మోసం..

ఏ మాట వెనుక ఎవరి స్వార్ధం ఉందొ తెలుసుకోలేనంతకాలం మోసపోతూనే ఉంటాం అని లెనిన్ చెప్పినట్లు.. ఆ విషయాన్నే మరిచిపోయి ఈ ప్రజలు మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు. తాజాగా ఇన్సూరెన్స్ పాలసీల పేరుతో ఓ వృద్ధురాలి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.15 లక్షలు దండుకున్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ వృద్ధురాలి(80)తో… ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి లాయాలిటీ, రివర్సల్ బోనస్​ల పేరుతో ఉత్తరప్రదేశ్​కు చెందిన ముగ్గురు సైబర్ కేటుగాళ్లు ఆమెకు ఫోన్​ చేశారు. బోనస్ డబ్బుల ఆశ చూపి అందినకాడికి దోచుకున్నారు. ఆర్పీఐ, ప్రాసెసింగ్, సెబీ, వివిధ ఛార్జీల పేరుతో రూ.15.47 లక్షలు అకౌంట్లో వేయించుకున్నారు. అనంతరం వారి ఫోన్​ స్విచాఫ్​ రావడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు… యూపీలోని ఘజియాబాద్​కి చెందిన దేవాన్ష్, ఇమ్రాన్ ఖాన్​ను అరెస్టు చేసి రిమాండు​కు తరలించారు. మరో నిందితుడు రస్టజీ పరారీలో ఉన్నట్లు… త్వరలోనే అతడిని పట్టుకుంటామని సైబర్​ పోలీసులు తెలిపారు.