బయటపడిన పొంగులేటి బ్రదర్స్ విబేధాలు.. నిజ స్వరూపం బయటపడింది


వైసీపీ పార్టీ నుండి ఎంపీగా గెలుపొందిన నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొంగులేటి బ్రదర్స్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. పొంగులేటి బ్రదర్స్... సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిల మధ్య పెద్ద వివాదాలేమీ లేవు. అయితే వైసీపీ ఆవిర్భావం తరువాత వైసీపీ పార్టీలో చేరిన శ్రీనివాస రెడ్డి ఆతరువాత మంచిపేరు తెచ్చుకున్నారు. మరోవైపు సుధాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో మంచిపేరు తెచ్చుకొని ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అయితే నిన్న శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించగానే సుధాకర్ రెడ్డి ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ముసుగు వేసుకుని ఇంతకాలం వైసీపీలో కొనసాగిన శ్రీనివాసరెడ్డి నిజ స్వరూపం ఎట్టకేలకు బట్టబయలైందని.. అసలు ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీనివాసరెడ్డి ఏం చేశారని తెలంగాణ కోసం ఉద్యమం చేశారా? జైలుకెళ్లారా? ఆయనను పార్టీలో చేర్చుకుంటున్నారని కూడా టీఆర్ఎస్ నేతలను సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu