విజయవాడలో 50 లక్షల నగదు పట్టివేత..

విజయవాడ లో ఓ కార్పొరేటర్‌ అభ్యర్థి బంధువు ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల సందర్బంగా అభ్యర్థుల ఇంట్లో  టాస్క్ ఫోర్స్ పక్క సమాచారం రావడంతో అధికారులు ఈ తనికీలు నిర్వహించారు. ఓ ఇంట్లో దాదాపు 50 లక్షలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డబ్బు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందించారు. అమరావతి నగర్ 3వ లైన్‌లో ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మిషన్లు తీసుకెళ్లిన పోలీసులు డబ్బులను లెక్కించారు. సుమారు రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి చెందిన కార్పొరేటర్‌ అభ్యర్థి బంధువు ఇంట్లో డబ్బు పట్టుబడింది. డబ్బులు పట్టుబడిన వ్యక్తి వైసీపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బరువుగా పోలీసులు  అనుమానిస్తున్నారు. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News