మోడీ, ఒబామా భేటీ.. గుజరాతీలో పలకరింపు

 

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీని పలుకరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు ఒబామా స్వయంగా గుజరాతీ భాషను నేర్చుకున్నారు. సోమవారం మోడీకి ఇచ్చిన విందు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మోడీతో భేటీ కోసం నెలల తరబడి వేచి చూస్తున్న ఒబామా, విందు సందర్భంగా మోడీని గుజరాతీ భాషలో పలుకరించారు. ‘‘కెమ్ ఛో (ఎలా ఉన్నారు)’’ అంటూ మోడీని పలుకరించిన ఒబామా అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. దానికి మోడీ స్పందించి ‘థాంక్యూ’ అన్నారు. విందులో భాగంగా ఒబామాతో పాటు ఆ దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ హాజరు కాగా, మోడీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికాలో భారత రాయబారి జై శంకర్ ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu