ఆంధ్రుల మనసు గెలుచుకున్న మోడీ

 

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ.. తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు, శంకుస్థాపన చేయడమే కాకుండా చంద్రబాబు ప్రారంభించిన 'మన నీరు మన మట్టి' కార్యక్రమంలో నేనుసైతం అంటూ పార్లమెంట్ ప్రాంగణం నుంచి తీసుకొచ్చిన మట్టిని, యమునానది నుంచి సేకరించిన పవిత్ర జలాలను చంద్రబాబుకి అందించారు, శ్రీశ్రీ కవితను ప్రత్యేకంగా ప్రస్తావించిన మోడీ... అక్కడక్కడా తెలుగులో మాట్లాడుతూ ఆహుతులను ఆకట్టుకున్నారు, ప్రజారాజధాని అమరావతి కోసం పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టిని, యమునానది నుంచి పవిత్ర జలాలను తీసుకురావడం ద్వారా ఆంధ్రుల మనసులను ప్రధాని మోడీ గెలుచుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu