జపాన్ శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి

 

రెండు రోజుల క్రితం వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. జపాన్‌కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, జపాన్‌లోనే పుట్టిపెరిగి అమెరికాలో స్థిరపడిన ఘజి నకమురాలు 2014 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలు అందుకుంటారు. ఈ విషయాన్ని ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగునిచ్చే ఎల్ ఇ డి లైట్‌ని కనుగొన్నందుకు వీరిని ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu