ఢిల్లీ గ్యాంగ్ రేప్, సోనియమ్మ స్పందించడం గొప్ప: బొత్స
posted on Dec 24, 2012 4:27PM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఢిల్లీ ఘటన పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ఎంత మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వస్తే మాత్రం..ఒంటరిగా తిరిగేస్తామా ? అసలు ఢిల్లీలో ఆ బస్సును ఆ జంట ఎక్కి ఉండకపోతే బాగుండు..ఎక్కేముందు ఆలోచిస్తే బాగుండు. అయినా అమ్మాయిలు బయటతిరగాలంటే సమయమూ..సంధర్భమూ చూసుకోరా ? జరిగింది ఆది చాలా చిన్న సంఘటన..అయినా కూడా మా పార్టీ అధినేత్రి సోనియమ్మ నిరసనకారులతో శనివారం ఆర్ధరాత్రి, ఆదివారం ఉదయం చర్చలు జరిపేశారు. సోనియమ్మ స్పందించటం మామూలు విషయమా..శాలా గొప్పవిషయం” అని నోటికొచ్చింది చెప్పేశారు. భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఆ సంఘటన మన సత్తిబాబుకు చిన్నదిగా అనిపించింది. ఇక ఈ సంఘటనపై సోనియా స్పందించడం మాత్రం మా గొప్ప విషయంగా కనిపించింది.
బొత్స గారు అన్న మాటలు మీడియాలో ప్రసారం కాగానే రాష్ట్రమంతా కలకలం రేగింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. గ్యాంగ్ రేప్ ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకుంటున్నానని అన్నారు. తాను ఎవరి హృదయాను గాయపర్చాలని అలా అనలేదన్నారు. ఓ తండ్రిలా, సోదరుడిలా మాత్రమే భావించి అలా చెప్పానన్నారు. ఎవరినైనా గాయపరిస్తే అపార్థం చేసుకోవద్దన్నారు. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నానని బొత్స చెప్పారు.