మేం తల్చుకొంటే టిఆర్ఎస్ అడ్రసుండదు : బాబు

  

  

టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫై తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ‘నేను మీ నాయకుడిలా ఆరు నెలలకొకసారి నిద్ర లేచేవాడిని కాదు’, అని బాబు టిఆర్ఎస్ కార్యకర్తలఫై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కరీంనగర్ లో జరుగుతున్న బాబు పాద యాత్రను నిన్న కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొన్నారు. దీనితో ఆగ్రహించిన బాబు తాము తలచుకొంటే టిఆర్ఎస్ పార్టీకి అడ్రస్ ఉండదని వారిని హెచ్చరించారు. జిల్లాలోని జూబ్లీ నగర్ వద్ద బాబు యాత్రకు తెలంగాణ వాదుల నుండి అడ్డంకులు ఎదురయ్యాయి.

 

తెలంగాణాఫై తమ వైఖరి చెప్పాలని వారు బాబును డిమాండ్ చేశారు. తెలంగాణా కు వ్యతిరేకం కాదని తాను ఎప్పటినుండో చెపుతున్నానని, భవిష్యత్ లో కూడా తాను ఇదే అభిప్రాయంతో ఉంటానని బాబు స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే మీ పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని ఇక్కడకు పంపిస్తున్నాడని బాబు వారితో అన్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తాను పోటీ చేసిన స్థానాల్లో గెలిచి ఉంటే తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చేదని బాబు అన్నారు.

 

తన పాద యాత్ర జరుగుతున్న ప్రాంతాలకు రావద్దని టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలకు చంద్ర బాబు సూచించారు. నిన్న బాబు పాద యాత్ర జిల్లా లోని జుబ్లీ నగర్, చామనపల్లి, చెర్ల బూత్కూర్, దుబ్బపల్లి, భూపతిపూర్, గర్రెపల్లి ప్రాణాల మీదుగా సాగింది.