పవన్ కళ్యాణ్‌ని తుఫాన్‌తో పోల్చిన నరేంద్ర మోడీ!

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్‌ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల్లో ముంచెత్తారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘‘ఇక్కడ కూర్చున్న వ్యక్తి కేవలం పవనం కాదు.. తుఫాన్’’ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ, ప్రధాన మంత్రిగా మోడీకి తన పార్టీ నుంచి మద్దతు తెలియజేశారు. మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధిలోకి వెళ్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu