మరి కొద్ది సేపటిలో మీడియా ముందుకు రానున్న పవన్ కళ్యాణ్

 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే మరి కొద్ది సేపటిలో మీడియా ముందుకి వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న అవాంఛనీయమయిన పరిణామాల గురించి మాట్లాడబోతున్నారు. క్రిందటి నెల 28వ తేదీనఆయన తన ట్వీటర్ లో త్వరలో తను మీడియా ముందుకు వచ్చి అన్ని విషాయల గురించి మాట్లాడుతానని మెసేజ్ పెట్టారు. అందుకే మళ్ళీ చాలా రోజుల తరువాత ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ తన అభిప్రాయాలు వ్యక్తం చేయబోతున్నారు.