మరోసారి ఉలిక్కిపడ్డ పారిస్.. ఉగ్రవాది కాల్పులు

 

పారిస్ లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. మాగ్నావిల్‌ లో ఓ ఉగ్రవాది కాల్పులతో విరుచుకుపడగా.. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఉగ్రవాదిని హ‌త‌మార్చారు. కాగా మాగ్నావిల్‌ ప్రాంతంలో దాడికి దిగింది తామేన‌ని అనంత‌రం ఇస్లామిక్ స్టేట్ ప్ర‌క‌టించింది. పారిస్‌లో భ‌ద్ర‌త‌ను పెంచారు. అక్క‌డి ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే గతంలో జరిగిన ఉగ్రదాడులకు పారిస్ ప్రజలు భయపడుతుంటే.. ఇప్పుడు ఈ కాల్పులతో ఆ ప్రాంతం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.