పాక్ రేంజర్ల కాల్పులు...జ‌వాను మృతి

 

భారత్ సరిహద్దుల్లో పాక్ సైన్యం పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి పాకిస్థాన్ రేంజ‌ర్లు  కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. జమ్ముక‌శ్మీర్‌ మెంధ‌ర్‌లోని బ‌లా కోటేలో పాక్ రేంజర్లు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు భార‌త జ‌వాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఉధంపూర్‌కి త‌ర‌లించారు. మ‌రోవైపు రాజౌరీలోని మంజాకోటే, గంభీర్ సెక్టార్ల‌లో పాక్ రేంజ‌ర్లు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఓ జ‌వాను ప్రాణాలు కోల్పోయాడు.