ప్రధాని మోడీకి స్వయంగా స్వాగతం పలకనున్న పాక్ ప్రధాని

 

ఎవరూ ఊహించని విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి డిల్లీ వస్తూ దారిలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలనుకోవడంతో ఇరు దేశాలలో హర్షం వ్యక్తం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడి దౌత్యపరమయిన పట్టింపులను పక్కన పెట్టి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తునందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అందుకు ప్రతిగా ఆయన కూడా దౌత్యపరమయిన పట్టింపులను పక్కనబెట్టి ఆయనే స్వయంగా మోడీకి స్వాగతం తెలిపేందుకు లాహోర్ లో అల్లామ ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళారు. బహుశః అక్కడే వారిద్దరూ కొంత సేపు మాట్లాడుకొన్నాక మళ్ళీ మోడీ డిల్లీకి బయలుదేరవచ్చని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య మొదలయిన చర్చల ప్రక్రియ గురించి కూడా వారు మాట్లాడుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu