లాహోర్ చేరుకున్న మోడీ

 

భారత ప్రధానమంత్రి మోడీ పాకిస్థాన్‌లోని లాహోర్‌కి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌కి వెళ్ళిన మోడీ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌కి వెళ్ళారు. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం పాకిస్థాన్‌లో మోడీ పర్యటన లేదు. అయితే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజును పురస్కరించుకుని కాబూల్‌ నుంచి మోడీ ఆయనకు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు షరీఫ్ ఆయన్ని లాహోర్ కి ఆహ్వానించారు. దాంతో మోడీ లాహోర్‌కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయన్ని మోడీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వాజ్‌పేయి తర్వాత పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్ళిన మొదటి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu