చంద్రబాబుపై నోరు జారిన ఈశ్వరి.. అరెస్ట కు రంగం సిద్దం..


విశాఖ ఏజెన్నీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జగన్ ఆధ్వర్యంలో చింతపల్లిలో బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఎప్పటిలాగానే జగన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శల బాణాలు వదిలారు. అయితే ఇదే సభకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా హాజరయ్యారు. ఇక తన వంతు రాగానే మాట్లాడతూ.. అధికార పార్టీపై విమర్శలకు దిగారు.. కానీ అక్కడితో ఆగకుండా ఏపీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును పట్టుకొని.. బాక్సైట్ తవ్వకాలకు అంటూ వస్తే మాత్రం చంద్రబాబు తల నరుకుతూ.. బాణాలతో చంపుతా అంటూ నోరు జారింది. అంతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అలా అంటుందా అని టీడీపీ నేతలు ఆమెపై మండిపడుతున్నారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. మధ్యాహ్నానికి ఈశ్వరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలా సంబోదించడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu