కేసీఆర్ కుట్రలు తిప్పి కొడతాం... ఓయూ

ఉస్మానియా యూనివర్శిటిలో విద్యార్ధుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓయూలో ఉన్న భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఓయూ విద్యార్ధుల సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు ఓయూలోని ఇంచి భూమిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కు ఓయూ భూముల పట్ల ఉన్న బుద్ధి మారాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని సరస్వతి దేవాలయంలో ప్రత్యేకపూజలు కూడా చేశారు. ఓయూ లో భూములను విద్య కోసం ఉపయోగించాలే తప్ప ఇతర అవసరాలకు ఉపయాగిస్తే కేసీఆర్ ను ఆర్ట్స్ కాలేజీ కిందే బొంద పెడతామని విద్యార్ధిసంఘాలు హెచ్చరించాయి. ఓయూ భూముల పై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయనున్నారు. ఓయూ నిరుద్యోగ జేఏసీ చెైర్మన్ కల్యాణ్ మాట్లాడుతూ కేసీఆర్ ఓయూ భూములపై చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu