అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాం.. వెంకయ్యనాయుడు చేత ఆవిష్కరణ

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా పార్కులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఅర్ విగ్రహాన్ని జులై 5 వ తేదీన ఆవిష్కరించనున్నారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అమెరికా వెళ్లనున్నారు. వారం రోజుల పాటు వెంకయ్యనాయుడు బిజీ షెడ్యూల్ తో గడపనున్నారు. జులై 1న అమెరికా, భారత్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని.. తరువాత బీజేపీ మద్దతుదారుల సమావేశానికి హాజరవుతారు. జులై 3న డెట్రాయిట్ లో తానా వార్షికోత్సవాన్ని ప్రారంభించి అనంతరం మిచిగాన్ గవర్నర్ స్నియడర్‌తో కలిసి వ్యాపార సదస్సు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన డెట్రాయిట్‌లో తానా అందిస్తోన్న జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆ తర్వాత జులై 4న లాస్ ఏంజిల్స్‌లో తెలుగు సంఘం నాట్స్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు. తరువాత జులై 5 న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  కృష్ణావతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని డి.రాజ్కుమార్ వుడయార్ శిల్పశాలలో, 80 కిలోల పంచలోహాలతో రూపొందించారు.