నిట్ తెలుగు విద్యార్ధులు.. ఫ్యాకల్టీనే అత్యాచారం చేస్తామని బెదిరించారు..

 

శ్రీనగర్ నిట్ లో స్థానికుల, స్థానికేతర విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్ధులు తన స్వస్థలాలకు రావడానికి అనుమతి ఇచ్చిన సంగతి కూడా విదితమే. అలా అక్కడి నుండి బయటపడిన విద్యార్ధులు యూనివర్శిటీలో అనుభవించిన కష్టాల గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీ నుండి ఢిల్లీకి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డామని.. నిరసన చేపడుతున్న సమయంలో స్థానిక విద్యార్దులు తమను బెదిరించారు.. ఆఖరికి ఫ్యాకల్టీ కూడా క్లాసులకు రాకపోతే అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తామని బెదిరించారని వాపోయారు. ఈ సందర్బంగా వారు తమ డిమాండ్లను కూడా తెలియజేశారు.. ఇక మేం అక్కడ ఉండలేమని.. నిట్ ను అక్కడి నుండి తరలించాలి.. లేదా మమ్మల్ని వేరే వర్శిటీల్లోకి చేరే అవకాశం ఇవ్వాలని.. మమ్మల్ని కొట్టిన శ్రీనగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన 30 మందికి పైగా విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన ఏపీ భవన్ అధికారులు, వారిని స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు.