రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం.. సచివాలయం ముందు కలకలం

వెలగపూడిలోని ఏపీ సచివాలయం ముందు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నెల్లూరు జిల్లాకు చెందిన రైతు దంపతులు పిల్లలతో సహా సూసైడ్ అటెంప్ట్ చేశారు. పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకోబోగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు తహసీల్దారు చంద్రశేఖర్ తమను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. చిట్టమూరు మండలం చిలమూరులో ఉన్న తమ పొలం ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు ఎమ్మార్వో డబ్బులు డిమాండ్ చేశారని అన్నారు. ఇప్పటి వరకూ కోటి రూపాయలు ఇచ్చామని చెప్పారు. డబ్బులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా తమ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని వాపోయారు. ఎమ్మార్వో తీరుతో విసుగు వేశారిని ఆ రైతు.. ఇక భూమిపై ఆశలు వదులుకున్నాడు. కుటుంబంతో కలిసి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక, ఎవరూ వారిని పట్టించుకోక.. జీవితంపై విరక్తి చెందాడు. పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.